Bansuwada : కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవ చివరకు పోలీసుల లాఠీచార్జికి దారి తీసింది. అసలేం జరిగిందంటే..?
స్థానికంగా ఉన్న ఒక సూపర్ మార్కెట్లో ఓ మతానికి చెందిన పాట పెట్టడంపై మరో మతానికి చెందిన వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. దాంతో.. వివాదం చెలరేగింది. ఆ వాగ్వాదం కాస్త పెద్దదవ్వడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. దాంతో.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ క్రమంలో ఓ వర్గానికి చెందిన వారు పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయక తప్పలేదు.