బ్రిటన్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు పేలింది. ఈ పేలుడులో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఈ బాంబును మంగళవారం కనుగొని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పేలిపోయింది.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తర్వాత మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఇంట్లో రహస్య డాక్యుమెంట్స్ బయటపడ్డాయి. ఈ నెపాన్ని న్యాయ శాఖపైకి నెట్టేందుకు పెన్స్ చూస్తుండటం విశేషం.
అల్ఖైదా ఉగ్రవాదిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సిరియా వెళ్లి ఐసిస్లో చేరాలన్న ఆయన పన్నాగాన్ని ఎన్ఐఏ భగ్నం చేసింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ఆయన ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని విచారిస్తన్నారు.
కెనడాలో పటాసుల అమ్మకాలపై నిషేధం విధిస్తున్నారు. కొన్ని నగరాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నారు. అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాణాసంచా హిందువుల సంస్కృతికి సంబంధించిన అంశమని వారంటున్నారు.
యూరప్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుడిగాలిలా పర్యటిస్తున్నారు. నిన్న బ్రిటన్కు వెళ్లిన ఆయన.. అర్ధరాత్రి ఫ్రాన్స్కు చేరుకుని అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్తో భేటీ అయ్యారు.
టిబెటన్ చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లి చైనా బోర్డింగ్ స్కూళ్లలో చేర్పిస్తున్నది. దీంతో వారు మాతృభాష మరిచిపోతారు. అలా తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారని యూఎన్ ఒక నివేదికలో వెల్లడించింది.
జెలెన్స్కీ బ్రిటన్లో ఆకస్మిక పర్యటనకు వచ్చారు. కింగ్ చార్లెస్తో సమావేశం కానున్నట్లు సమాచారం. యూకే పార్లమెంట్లో ప్రసంగం ఉంటుందని తెలుస్తున్నది. ఇక్కడి నుంచి ఆయన బ్రెజిల్ వెళ్తారు.
తన గుండె పగిలిపోయేలా చేసిన ప్రియురాలిపై ఓ వ్యక్తి కోర్టులో దావా వేశాడు. రూ.25 కోట్ల ఫైన్ చెల్లించేలా ఆదేశించాలంటూ తన పిటిషన్లో కోరాడు. ఈ పిటిషన్ను సింగపూర్ హైకోర్టు ఈ నెల 9 న విచారించనున్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వివాదాన్ని 24 గంటల్లో తేల్చేసేవాడినన్నారు.
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. గత 47 ఏండ్ల క్రితం కంటే ఎక్కువగా 27.6 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గితేనే రుణం మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.
బ్రిటన్లో కనీవినీ ఎరగని రీతిలో ఉపాధ్యాయులు, సివిల్ సర్వెంట్లు సమ్మెకు దిగారు. దశాబ్దంలో అతిపెద్ద ప్రదర్శనను లండన్లో చేపట్టారు. జీతాలు పెంచాలన్నది వారి ప్రధాన డిమాండ్.