IT raids on BBC | బీబీసీ కార్యాలయాల (BBC Offices) పై భారతదేశానికి చెందిన ఆస్తిపన్ను ( Income tax ) అధికారులు దాడులు బ్రిటన్ పార్లమెంట్కు చేరింది. బీబీసీ డాక్యుమెంటరీతోపాటు వారి కార్యాలయాలపై ఐటీ దాడులు చేయడంపై బ్రిటన్ పార్లమెంట్లో చర్చించారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ ( House of commons ) సభ్యుడు జిమ్ షానన్ (MP Jim Shannon) కోరారు. దీనిపై ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ప్రతినిధిగా ఎంపీ డేవిడ్ రాట్లీ (MP David Ratley) సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వం బీబీసీకి అండగా ఉంటుందని చెప్పారు. బ్రిటన్ పార్లమెంట్ (Britain Parliament) బీబీసీకి నిధులు సమకూరుస్తుందని, మేము దాని స్వతంత్రతను గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. బ్రిటిష్ ఎంపీలు దిగువ సభలో అత్యవసర ప్రశ్న ద్వారా ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, దాడులపై ఆయన ఏమాత్రం స్పందించలేదు. బ్రిటన్లోని కన్జర్వేటీవ్ పార్టీ, లేబర్ పార్టీలను కూడా బీబీసీ వ్యతిరేకిస్తుండటం విశేషం.
భారతదేశంలోని ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయంపై ఎంపీ డేవిడ్ రాట్లీ మాట్లాడుతూ.. బీబీసీకి వాక్ స్వాతంత్ర్యం ఉన్నదని, అది మాకు చాలా ముఖ్యమైనదని వెల్లడించారు. భారత ప్రభుత్వానికి కూడా ఈ విషయం చెప్పాలనుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. భారతదేశంతో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ, యూకే-భారతదేశం లోతైన స్నేహాన్ని కలిగి ఉన్నాయని, ఇతర సమస్యలతో పాటు దీనిపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంపై బ్రిటన్ ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచిందని తెలిపారు. మరోవైపు, కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ జూలియన్ లూయిస్ (MP Julian Lewis).. ఈ చర్యను అత్యంత ఆందోళనకరమైనదిగా అభివర్ణించారు.
చర్చ సందర్భంగా ఎంపీ జిమ్ షానన్ మాట్లాడుతూ.. భారత నాయకుడిపై విడుదల చేసిన డాక్యుమెంటరీని చూసి భయపెట్టే ప్రయత్నమే ఇది అని అన్నారు. మరో లేబర్ పార్టీ ఎంపీ ఫాబియన్ హామిల్టన్ (MP Fabian Hamilton) మాట్లాడుతూ.. బీబీసీపై ఈ చర్య బ్రిటన్కు ఆందోళన కలిగించే విషయమని, దాని వెనుక ఉన్న కారణాలతో సంబంధం లేకుండా అని చెప్పారు. దీనికి సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య జరిగిన సంభాషణ గురించిన సమాచారం ఇవ్వాలని కోరారు.