Raviteja New Movie OTT | మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నప్పటికీ డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు భారీగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుంది. దీంతో ఈ వారం మార్చి 13 శుక్రవారం నుంచి ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలుగా నటించారు. సునీల్, సత్య, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించగా, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. థియేటర్లలో విడుదలైన దాదాపు 60 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తున్న ఈ చిత్రం, రవితేజ మార్క్ కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వీకెండ్లో మంచి వినోదాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.