NRI | మెల్బోర్న్ నగరంలోని రాక్బ్యాంక్ దుర్గా మాత ఆలయంలో మెల్బోర్న్ బోనాలు సంస్థ ఆధ్వర్యంలో బోనాల జాతర ఘనంగా జరిపారు. అధిక సంఖ్యలో పాల్గొన్న తెలంగాణ మహిళలు అమ్మ వారికి బోనాలు, తొట్టెల సమర్పించుకుని తమ మొక్కును చెల్లించుకున్నారు. పోతురాజుల ఆట, పాటలు, యువకుల నృత్యాలతో సందడి చేసారు.
తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్న ఈ వేడుకలను అదే స్థాయిలో గత 12 సంవత్సరాలుగా మెల్బోర్న్ బోనాలు సంస్థ నిర్వహిస్తున్నది. వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలంగాణ మధు, రాజు వేముల, దీపక్ గద్దె, ప్రజీత్ రెడ్డి కోతిని పలువురు అభినందించారు.