దేశంలో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘భారత్ రాష్ట్ర సమితి’ పార్టీని ఏర్పాటుచేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం అభినందనీయం.
దేశాన్ని గత 75 ఏండ్లుగా పాలిస్తున్న రెండు జాతీయ పార్టీలు ఉత్తరాదికి చెందినవే. దక్షిణాది పార్టీలు కూటముల్లో చేరాయి తప్ప సొంతంగా ఆధిపత్యం వహించే అవకాశం రాలేదు.