కొండ కోనల్లో బండల సందుల్లో
యథేచ్ఛగా పెరుగుతూ..
ఎప్పటికప్పుడు నవపల్లవ
ఉత్సాహాన్ని పెంచుకుంటూ
హరితహారాల తరువులై
పుడమి తల్లి మెడలో మెరిసే
మణి మాణిక్యాలు..
మనందరి మనుగడకు మూలాధారాలు..!
ఎవరి ఆలనా పాలనా లేకున్నా
తమకు తామే ఎదిగి..
పరోపకారపు కొమ్మలకు
మమకారపు కాయలూ పండ్లూ కాయిస్తూ
నవనవలాడే నావీన్యంతో..
పక్షులకూ కీటకాలకూ ఆవాసాలై నిలుస్తూ
రుతువుల క్రతువుల్లో తమ వంతు..
కర్తవ్యాన్ని పోషిస్తున్న కర్మజీవులు
అందరి కడుపులు నింపుతున్న అన్నపూర్ణలు..!
మనసున్న మనిషి మాత్రం
నవజీవన పత్రాలనే కాదు
వాటి మూలాలను కూడా
అమాంతంగా మింగేస్తూ..
మరు భూమిలా మారుస్తూ..
సిమెంటు రాళ్ళ సింహాసనాలే నిర్మిస్తూ
కన్నూమిన్నూ కానక విర్రవీగే కలాపంలో..
రేపటి తరానికి నవజీవన పత్రపు
నమూనా అయినా మిగల్చగలడా?
అనేది.. రెండు నిమిషాలు
గుండెల మీద చేతులేసి..
తనని తాను..ప్రశ్నించుకోవడం ..
అగత్యమే మరి…!
సావిత్రి రంజోల్కర్ నవీ ముంబై: 98334 97812