Today History: కాకోరి కుట్ర కేసులో ముగ్గురు భారతీయులకు అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం 1927 లో సరిగ్గా ఇదే రోజున ఉరిశిక్ష విధించింది. భారత మాతను విదేశీ దాస్య శృంఖలాల నుంచి విడిపించేందుకు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫఖ్ఉల్లా ఖాన్, రోషన్ సింగ్లు ఉరికంభాన్ని ముద్దాడి వీర పుత్రులుగా చరిత్రలో నిలిచిపోయారు. సహ్రాన్పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలును కాకోరి స్టేషన్ వద్ద క్రాంతికారి ఉద్యమకారులు దోచుకోవడంతో.. ఈ కేసును కాకోరి కుట్ర కేసుగా పిలుచుకుంటున్నాం.
భారతదేశాన్ని స్వాతంత్య్రం సిద్ధించాలంటే ఆయుధాలతో పోరాడక తప్పదని భావించిన సచింద్రనాష్ సన్యాల్ నాయకత్వంలో యువ ఉద్యమకారుల బృందం హిందుస్తాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను స్థాపించారు. దీనిలో తొలుత ముఖ్య సభ్యులుగా యోగేశ్చంద్ర ఛటర్జీ, రామ్ ప్రసాద్ బిస్మిల్, సచింద్రనాథ్ భక్షి ఉండేవారు. అనంతరం వీరితో చంద్రశేఖర్ ఆజాద్, భగత్సింగ్లు కలిశారు. దీనికి ప్రధాన కారణంగా కరమ్చంద్ గాంధీ. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ ఉపసంహరించుకోవడంతో నిరాశ చెందిన యువ విప్లవకారులు ఆయుధాల బాటను ఎంచుకున్నారు. ఆయుధాలను కొనుగోలు చేయాలంటే కావాల్సిన నగదు కోసం ప్రభుత్వ గల్లాను కొల్లగొట్టాలని నిర్ణయించుకున్నారు. 1925 డిసెంబర్ 9 న సహ్రాన్పూర్ నుంచి లక్నో వెళ్తున్న రైలును కాకోరి రైల్వే స్టేషన్ వద్ద ఆపిన క్రాంతికారి ఉద్యమకారులు.. రైలు గార్డును అదుపులోకి తీసుకొని రైళ్లో తీసుకెళ్తున్న రూ.4,601 నగదును దోచుకున్నారు.
ఈ ఘటన బ్రిటీష్ ప్రభుత్వంలో కలకలం రేపింది. వెంటనే అరెస్టులు మొదలుపెట్టారు. ఈ ఘటనలో 10 మంది పాల్గొన్నప్పటికీ.. నెల రోజుల్లోనే దాదాపు 40 మందిని అరెస్టు చేశారు. 1927 ఏప్రిల్ 6న తీర్పు వెలువడింది. రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫాఖ్ ఉల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్లకు మరణశిక్ష పడింది. చాలా మందికి 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించారు. ప్రభుత్వ సాక్షులుగా మారిన ఇద్దరిని విడుదల చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ పోలీసుల చేతికి చిక్కకుండా ఉండిపోయాడు. ఉరి నిర్ణయాన్ని భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించినా.. బ్రిటీష్ ప్రభుత్వం వినలేదు. రాజేంద్ర లాహిరిని 1927 డిసెంబర్ 17న గోండా జైలులో తొలుత ఉరితీశారు. 1927లో రామ్ ప్రసాద్ బిస్మిల్ను గోరఖ్పూర్ జైలులో, అష్ఫాఖ్ ఉల్లా ఖాన్ను ఫైజాబాద్ జైలులో, రోషన్ సింగ్ను అలహాబాద్లో ఉరితీశారు.
2012 : దక్షిణ కొరియా మొదటి మహిళా అధ్యక్షురాలిగా పార్క్ జియున్-హే ఎన్నిక
2007: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసిన టైమ్ మ్యాగజైన్
1998: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ను అభిశంసించిన అమెరికా ప్రతినిధుల సభ
1997: చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన టైటానిక్ విడుదల
1984 : 1997 నాటికి హాంకాంగ్ను చైనాకు తిరిగి ఇచ్చేలా చైనా-బ్రిటన్ మధ్య ఒప్పందం
1983: బ్రెజిల్లో ఫుట్బాల్ వరల్డ్ కప్ ట్రోఫిని ఎత్తుకెళ్లిన దొంగలు
1961: పోర్చుగల్ బానిసత్వం నుంచి గోవా ప్రాంతానికి విముక్తి
1934: భారతదేశం మొదటి, ఏకైక మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ జననం
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..