(Holidays) అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. స్కూళ్లకు క్రిస్మస్, సంక్రాంతి సెలవులను ప్రకటించింది. డిసెంబర్ 23 నుంచి 25 వరకు క్రిస్మస్ సెలవుగా ప్రకటించగా.. 26 న ఆదివారం సెలవుదినం. దాంతో మొత్తం నాలుగు రోజులు క్రిస్మస్ సెలవులు వచ్చాయి. కొన్ని మిషనరీ పాఠశాలలు మాత్రం డిసెంబర్ మాసాంతం వరకు సెలవులు ప్రకటించాయి.
ఇక, జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ సెలవులను కూడా ప్రభుత్వం ప్రకటించింది. సంక్రాంతి సెలవులను జనవరి 10 నుంచి 15 వరకు.. ఆరు రోజులు ఇచ్చారు. అయితే, సెలవులు ప్రారంభమయ్యే తొలిరోజు, చివరిరోజులు ఆదివారాలు కావడంతో.. సెలవులు 8 రోజులకు చేరాయి. మిషనరీ స్కూళ్లకు మినహా మిగతా అన్ని పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 17 నుంచి పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ) అకడమిక్ క్యాలెండర్లో సెలవులను పొందుపరిచింది.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..