(Srisailam and Adhar) కర్నూలు : శ్రీశైలం దేవస్థానంలో ఆర్జిత సేవలకు ఆధార్ కార్డును తప్పనిసరిగా అందజేయాలనే నిబంధన తీసుకొచ్చారు. ఆర్జిత సేవల టిక్కెట్లు దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయం ఈవో లవన్న వెల్లడించారు.
ఇకపై శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక దర్శనాలు, పూజల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డును అందజేయాల్సి ఉంటుంది. వీఐపీ బ్రేక్, అభిషేకం టిక్కెట్లకు ఆధార్ కార్డుతో లింకు పెట్టారు. స్వామి వారి ఆర్జిత టిక్కెట్లు దుర్వినియోగమవుతున్నందున ఈ నిబంధన తెచ్చినట్లు ఆలయ ఈవో లవన్న పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయం సిబ్బందితో సహకరించాలని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి విజ్ఞప్తి చేశారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..