Nallabelli | పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంటపై అలాగే అబ్బాయి బంధువులపై సుమారు 50 మంది అమ్మాయి బంధువులు దాడికి దిగిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం జరిగింది.
వానకాలం వ్యవసాయ సీజన్లో రైతులకు న్యాణ్యమైన విత్తనాలు, ఎరువులను అందించాలని ఎరువులు, పురుగుల మందుల దుకాణాల యజమానులకు కాజీపేట సీఐ సుధాకర్ రెడ్డి సూచించారు.
రైలు పట్టాలపై పెద్ద బండ రాళ్లు పెట్టి రెండు రైళ్లు నిలిచిపోయేందుకు కారకులైన ఇద్దరు నిందితులను రైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం వెలుగు చూసింది.
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దాసరి వేణు అన్నారు.
యూనియన్లకు అతీతంగా ఇటీవల మృతి చెందిన నిరుపేద జర్నలిస్ట్ శంకర్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.