Farmers | రాయపోల్ ఫిబ్రవరి 25 : అకాల వర్షానికి రైతులకు అపార నష్టం జరిగిందని.. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంట నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సర్వుగారి యాదవ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు కళ్ళముందే ఈదురు గాలులు, అకాల వర్షంతో నేలవాలడం పట్ల రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు కష్టపడి పండించిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. దీంతో రైతులకు అప్పు లు మిగిలిపోయాయని విచారం వ్యక్తం చేశారు. వ్యవసాయ అధికారులు గ్రామాల్లో రైతులు వేసిన పంటలు అకాల వర్షానికి దెబ్బతిన్న వాటిని పరిశీలించి జిల్లా అధికారులకు నివేదిక అందించి పరిహారం అందే విధంగా యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం రైతు భరోసా ఇప్పటికి ఇవ్వలేదని.. దీంతో పంట పెట్టుబడులు రైతులకు భారంగా మారిందన్నారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయాన్ని వెంటనే ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!