Student | జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 25 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అష్రా మెహీన్ 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. విద్యార్థిని, తన తండ్రి ఎంత బ్రతిమిలాడినా నిబంధనల కారణంగా పరీక్షకు అనుమతించలేదు. దీంతో చేసేదేమి లేక విద్యార్థిని వెనుతిరిగిపోయింది.
రంజాన్ ప్రారంభమైన రోజు వల్ల ఉపవాస దీక్షలో ఉన్న విద్యార్థిని.. రాత్రి 3 గంటలకు భోజనం చేసి కొంత సేపు నిద్రపోయి లేస్తాననుకున్న విద్యార్థిని తీరా లేచేసరికి సమయం ఉదయం 8:40 గంటలు అయ్యింది. హుటాహుటిన తయారై తండ్రితో కలిసి జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా నుంచి పరీక్షా కేంద్రానికి బయలుదేరింది. కొంత దూరం రాగానే వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో మరింత ఆలస్యమైంది. చివరకు విద్యార్థిని పరీక్షా కేంద్రానికి చేరుకోగానే 9:15 నిమిషాలు సమయం కావడంతో అధికారులు లోనికి అనుమతించలేదు.
విద్యార్థిని తండ్రి, విద్యార్థిని ఎంత బ్రతిమిలాడినా నిబంధనల ప్రకారం అధికారులు నిరాకరించడంతో నిరాశతో విద్యార్థిని వెనుతిరిగిపోయింది. విద్యార్థిని పరీక్ష రాయలేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు.


Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!