Tekulapalli : టేకులపల్లి ఫిబ్రవరి 25: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ రామా నాయక్ తన గ్రామ ఓటర్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఆదర్శంగా నిలిచారు. తాను గెలిస్తే ప్రతి ఇంటిలో ఆడపడుచుల పెళ్లి సందర్భంగా బీరువా అందజేస్తానని స్థానిక పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు.
ఈ మేరకు బుధవారం చుక్కల బోడు గ్రామపంచాయతీలో మాలోత్ కిషన్, జ్యోతి కుమార్తె వివాహం సందర్భంగా సర్పంచ్ బానోత్ రామా నాయక్ ఆ కుటుంబానికి బీరువా అందజేశారు. దీంతో బీరువా అందుకున్న కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. తమకు బహుమతి అందించిన సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం బీరువా అందజేశారని పంచాయతీ ప్రజలు చర్చించుకుంటున్నారు.