Prashant Umrao | బీజేపీ నేత ప్రశాంత్ ఉమ్రావ్ (Prashant Umrao ) చేసిన ట్వీట్పై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. మరింత బాధ్యతాయుతంగా ఉండాలని పేర్కొంది. తదుపరి విచారణలోపు దీనిపై క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది.
Supreme Court | ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు భద్రతా కారణాలు చూపుతూ మలయాళ న్యూస్ చానల్ ‘మీడియా వన్'ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కేంద్ర ప్రభుత్వం విపక్షాలపై రాజకీయ ప్రతీకారంతో దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నదని ఆరోపిస్తూ ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది.
ప్రార్థనా మందిరాలపై 1991 చట్టంలో పొందుపరిచిన కొన్ని నిబంధనల చెల్లుబాటును ప్రశ్నిస్తూ పలువురు దాఖలు చేసిన కేసుకు సంబంధించి కేంద్రం తన వైఖరిని తెలియజేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీ, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అల్టిమేటం జారీ చేసింది. తెలంగాణ ఒత్తిడి మేరకు ముంపుపై అధ్యయనానికి కాలపరిమితిని వి ధించిం�
ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే చేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బలవంతంగా డిజిటలైజేషన్ను దేశంపై రుద్దింది. కానీ భద్రతను మాత్రం గాలికొదిలేసింది.
ఎన్సీపీ ఎంపీ మహమ్మద్ ఫైజల్ ఎంపీ హోదా రద్దుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి ఒక్క రోజు ముందు హోదాను పునరుద్ధరించారు. ఆయనకు కింది కోర్టు విధించిన శిక్షను జనవరిలోనే హైకోర్టు సస్పెండ్ చేసింది.
రిటైర్డ్ జడ్జిలను ఉద్దేశించి కేంద్ర న్యాయశాఖ మంత్రి రిజిజు చేసిన వ్యాఖ్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ న్యాయమూర్తులను ‘భారత వ్యతిరేక ముఠా’గా పేర్కొనడాన్ని ఖండించారు.
Supreme Court | సుదీర్ఘంగా కొనసాగుతున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద(YS Viveka) హత్య కేసుపై సుప్రీం కోర్టు(Supreme court) సీబీఐ(CBI)కి కీలక ఆదేశాలు జారీ చేసింది.
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, కరోనా మహమ్మారి నేపథ్యంలో ఉక్రెయిన్, చైనా, ఫిలిప్పీన్స్ నుంచి భారత్కు తిరిగివచ్చిన చివరి సంవత్సరం వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టు శుభవార్త చెప్పింది.