హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరగనున్న టీ20 మ్యాచ్పై సుప్రీంకోర్టు హైలెవెల్ కమిటీ వేసింది. గురువారం నాడు జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో మ్యాచ్ నిర్వహణపై సుప్రీంకోర్టు సూపర్వైజరీ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రిటైర్డ్ చీఫ్ జస్టిస్ కక్రూ నేతృత్వంలో ఈ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో ఏసీబీ డీజీ అంజనీ కుమార్, వెంకటపతి రాజు, మాజీ క్రికెటర్ వంకా ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ స్టేడియంలో సుమారు మూడేళ్ల తర్వాత మ్యాచ్ జరుగుతుండటంతో క్రీడాభిమానులు టికెట్ల కోసం గురువారం నాడు ఎగబడ్డారు. అదే సమయంలో ఇక్కడ బ్లాక్లో టికెట్లు అమ్ముతున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీనిపై హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ మాట్లాడుతూ.. టికెట్ల అమ్మకాలకు, తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.
టికెట్ల సేల్స్ను థర్డ్ పార్టీకి అప్పగించామని వెల్లడించారు. క్రికెట్ గురించి ఏమాత్రం తెలియని వాళ్లు కూడా తమపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. ఈ నెల25న మ్యాచ్ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తానని అనడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.