న్యూఢిల్లీ: లిక్కర్ బాటిళ్లపై ‘ఆరోగ్య హెచ్చరికలు’ ముద్రించేలా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని దాఖలైన పిల్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సిగరెట్ ప్యాకెట్లపై ‘ఆరోగ్యానికి హానికరం’ అని స్టిక్కర్లు వేసినట్లే మద్యం బాటిళ్లపై కూడా వేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానంలో న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిల్ దాఖలు చేశారు.
సిగరెట్ కంటే లిక్కర్ పదిరెట్లు హానికరమని అందులో పేర్కొన్నారు. ఈ పిల్ను చీఫ్ జస్టిస్ లలిత్, జస్టిస్ బెనర్జీ, జస్టిస్ రవీంద్ర భట్తోకూడిన బెంచ్ పరిశీలించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము తలదూర్చలేమని పేర్కొంది. మితంగా ఆల్కహాల్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణుల సూచనలు కూడా ఉన్నాయని ప్రస్తావించింది.