న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: శీతాకాలంలో దాదాపు ఆరు నెలలుగా మూసివేసిన ప్రఖ్యాత కేదార్నాథ్ ఆలయం ద్వారాలు ఏప్రిల్ 22న తెరుచుకోనున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని మందిరాన్ని తిరిగి తెరిచేందుకు శుభ తేదీ, సమయాన్ని నిర్ణయించినట్టు ఆలయ ప్రజా సంబంధాల అధికారి హరీశ్ గౌర్ ఆదివారం వెల్లడించారు.
దీంతో ఈ ఏడాది చార్ధామ్ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఏప్రిల్ 23న, గంగోత్రి, యమునోత్రి ధామ్ ఏప్రిల్ 19న తెరుచుకుంటున్నాయి. ఉత్తరాఖండ్లోని గర్వాలీ హిమాలయ పర్వతాల్లో కొలువైన ఓంకారేశ్వర్ ఆలయం తలుపులు ఏప్రిల్ 22న ఉదయం 8 గంటలకు తెరుచుకుంటాయని, దీనికంటే ముందు పండితులు, పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారని
తెలిపారు.