న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ శుక్రవారం పదవీవిరమణ పొందారు. 2018 ఆగస్టు 7న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్ ఇందిర దాదాపు రెండు దశాబ్దాలపాటు న్యాయరంగానికి ఎనలేని సేవలు అందించారని సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ప్రశంసించారు.
జస్టిస్ ఇందిరా బెనర్జీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరింత మంది మహిళా న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో పనిచేస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. జస్టిస్ బెనర్జీ పదవీవిరమణ పొందటంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ముగ్గురే మహిళా న్యాయమూర్తులు మిగిలారు.