మొగులుకు చిల్లు పడింది. సెప్టెంబర్లో ఎన్నడూ లేనంతగా రికార్డు వాన దంచికొట్టింది. ఎడతెరపిలేని భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. అత్యంత భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని, ఈఆర్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం మొదలైన వాన ఆదివారం కూడా కొనసాగింది. సూర్యాపేట జిల్లాలో కురిసిన అతి భారీ వర్షపాతం అతలాకుతలం చేసింది. కోదాడ, �
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో జనం ఇండ్లు విడిచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది.
అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఎడతెరిపి లేని వర్షంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా లు తడిసి ముద్దవుతున్నాయి.
నల్లగొండ జిల్లా అంతటా అల్పపీడన ప్రభావంతో కురిసిన ఆస్మా తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు నల్లగొండ జిల్లా సగటు వర్షపాతం 10.9 సెంటీమీటర్లు నమోదైంది. అత్యధికంగా కేతేపల్
వరుసగా కురుస్తున్న వర్షాలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లపై వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నారు. దీంతో వెనుకలా వచ్చే వాహనాలు సైతం ప్రమాదానికి గురవుతున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం లేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆదేశించారు.
నల్లగొండ జిల్లాలో వ ర్షం బీభత్సం సృష్టించింది. శనివారం ఉదయం ప్రారంభమైన వాన ఆదివారం ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా పడింది. కాపురాల, బ్రహ్మంగారి, లతీఫ్సాబ్ గుట్టల నుంచి వర్షపు నీరు పెద్ద ఎత్తున రావడంతో పట్టణ�
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వానలు దంచికొడుతున్నాయి. ఆదివారం రెండో రోజు కూడా ముసురు వదల్లేదు.
ఎడతెరిపి లేని వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. కూకట్పల్లి, అల్లాపూర్ ప్రాంతాల్లో 20 ఇండ్లు నీటి మునిగాయి. వానకు తోడు బలంగా వీచిన గాలులతో గ్రేటర్ వ్యాప్తంగా 115 చోట్ల చెట్లు విరిగిపడ్డాయి.
జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.
జిల్లావ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించార�