Kaleshwaram | తెలంగాణ మిషన్ మోడ్ పనివిధానం అద్భుతమని, ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయడం అపూర్వమని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇంజినీర్ల బృందం ప్రశంసించింది.
దక్షిణ భారత దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ ఎదిగి దేశ ప్రజలకు బువ్వ పెడుతున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో భూమికి బరువయ్యే విధంగా పంటలు పండుతున్నాయని తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అమలు చేస్తున్న తెలంగాణ డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ (టీఐడీఎస్ఎస్) సత్ఫలితాలనిస్తున్నదని రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ వెల్లడించారు.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మానుకోటలో చేదు అనుభవం ఎదురైంది. శనివారం మహబూబాబాద్ మండలం అమనగల్, బలరాంతండా, శనిగపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు షర్మిల పాదయాత్ర కొనసాగింది.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశ ప్రజలను ఆకర్షిస్తున్నాయని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు.
ఖమ్మంలో నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లిలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీ
కాళేశ్వరం ప్రాజెక్టు సూర్యాపేట జిల్లాకు వరప్రదాయినిగా మారింది. గతంలో చుక్కనీరు లేక బీడుబారిన నేలల్లో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. చెరువులు, కుంటలు జలకళ సంతరించుకోగా భూగర్భ జలాలు గణనీయంగా పెరి
ఈ దేశానికి స్వాతంత్య్రం ఎందరో మహానుభావుల త్యాగఫలం. ఈ 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అలజడులు పెరిగాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి పంప్హౌస్ పునఃప్రారంభమైంది. తొలి రెండు మోటర్లు విజయవంతంగా నీటిని ఎత్తిపోయడంతో ఇంజినీరింగ్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన కన్నెపల్లి పంప్హౌస్ నీటి ఎత్తిపోతలకు సిద్ధమైంది. అసాధారణ వర్షాలతో గత జూలై 14న కన్నెపల్లి పంప్హౌస్ పూర్తిగా నీట మునిగిన విషయం తెలిసిందే.