సమైక్య రాష్ట్రంలో అరిగోస పడ్డ రైతులు స్వరాష్ట్రంలో సంబురంగా ఎవుసం చేసుకుంటున్నారు. ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లను 600 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్. ఇవ్వాళ ఎటు చూసినా కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతాలు మనకండ్లముందు కనిపిస్తున్నాయి. మండుటెండల్లో అలుగులు పారుతున్న చెరువులు, చెక్డ్యామ్లు, నిండుకుండలా రిజర్వాయర్లు జల సవ్వడులు చేస్తున్నాయి. పచ్చని పంట పొలాలతో జిల్లా కోనసీమను తలపిస్తుంది. ప్రతి సంవత్సరం వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది.
భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. తెలంగాణ (Telangana) భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మారింది. బుధవారం సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ హెలికాప్టర్ నుంచి ఏరియల్ వ్యూ ద్వారా జిల్లాలోని కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లను చూసి రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మంత్రముగ్ధులయ్యారు.
సిద్దిపేట, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎక్కడో ఉన్న గోదావరి నీళ్లు 600 మీటర్ల ఎత్తునకు తీసుకువచ్చిన అపరభగీరథుడు సీఎం కేసీఆర్ (CM KCR). ఇవ్వాళ ఎటు చూసినా కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు అద్భుతాలు మన కండ్లముందు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పచ్చని పంట పొలాలు, మండుటెండల్లో అలుగులు పారుతున్న చెరువులు, చెక్డ్యామ్లు, నిండుకుండలా రిజర్వాయర్లు జలసవ్వడులు చేస్తున్నాయి. నదికి కొత్త నడక నేర్పిన వ్యక్తి సీఎం కేసీఆర్. మూడున్నరేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ బుధవారం సిరిసిల్ల పర్యటనకు వెళ్తూ హెలికాప్టర్ ద్వారా సిద్దిపేట జిల్లాలోని కాళేశ్వర జలాలతో నిండుకుండలా ఉన్న కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లను చూసి మంత్రముగ్ధులయ్యారు. ప్రస్తుతం మల్లన్నసాగర్ రిజర్వాయర్లో 11.54 టీఎంసీలు, కొండపోచమ్మ రిజర్వాయర్లో 9.3 టీఎంసీల గోదావరి జలాలు ఉన్నా యి. మూడేండ్లల నుంచి గోదావరి జలాలతో జిల్లాలోని వాగులు, చెరువులను మండుటెం డల్లో నింపుతున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? ఇది సాధ్యమయ్యే పనేనా.. ఇది కలలో కూడా కాని పని.. ఇది ఎక్కడ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు, గిట్టని వాళ్లు నానా రకాలుగా మాట్లాడారు. వారి మాటలను పటాపంచలు చేసి ఈప్రాంత ప్రజల కలను సీఎం కేసీఆర్ నిజం చేశారు. కలలో కూడా కాని పనిని తానే రూపకల్పన చేసి, ఎగ్జిక్యూట్ చేసి స్వయంగా ప్రజలకు అంకితం చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నాడు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. కానీ, నేడు దేశానికి అన్నం పెడుతున్నారు. నాడు వ్యవసాయం చేయాలంటే రైతులకు ఎన్నో బాధలు ఉండేవి. ఇవ్వాళ రైతులకు మంచి రోజులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగునీరు వచ్చింది. రైతులకు నాణ్యమైన 24గంటల కరెంట్ వస్తుంది. రైతు బంధు, రైతుబీమా, సకాలంలో ఎరువులు, విత్తనాలతోపాటు రైతులు పండించిన పం టను చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వారం రోజుల్లో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకొని కోటి ఎకరాల మాగాణిగా సీఎం కేసీఆర్ మార్చారు. తెలంగాణలో యాసంగిలో 56లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. నాడు వడ్లు అంటే గోదావరి జిల్లాలు, కోనసీమ లాంటి ప్రాంతాలే ఉండేవి. ఇవ్వాళ ఇక్కడ 56 లక్షల ఎకరాల్లో వరి పంట పండిస్తే.. ఆంధ్రలో కేవలం 16 లక్షల ఎకరాల్లో మాత్రమే పండిస్తున్నారు.
2016-17వానకాలంలో 57,865 ఎకరాలు సాగైతే.. అదే 2022 వానకాలంలో 3,03,912 ఎకరాల్లో సాగు చేశారు. దాదాపు ఐదు రెట్లు వరిసాగు విస్తీర్ణం పెరిగింది. 2016 వానకాలంలో 16,613 మంది రైతులకు రూ. 65.76 కోట్లు చెల్లిస్తే.. వానకాలం 2022లో 99,386 మంది రైతులకు ప్రభుత్వం రూ.782.62 కోట్లు చెల్లించింది. 2016-17 యాసంగిలో 1,06,880 ఎకరాలు సాగు చేస్తే ..అదే 2021-22 యాసంగిలో 2,62,277 ఎకరాలు సాగు చేశారు. అప్పుడు 43,159 మంది రైతులకు రూ.278.13 కోట్లు చెల్లిస్తే గత యాసంగిలో 90,714 మంది రైతులకు రూ.769.06 కోట్లు ప్రభుత్వం చెల్లింది. (2022-23 యాసంగిలో 3,31,000 ఎకరాల్లో వరి సాగైంది) ఏటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది.