రాళ్లవానతో కూడిన అకాల వర్షాలతో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పంట నష్టం జరగడం బాధాకరమైన విషయం. 27 జిల్లాల్లో సుమారుగా 2,36,194 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లుగా సమాచారం. అత్యధికంగా 1.60 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్టుగా వ్యవసాయశాఖ క్షేత్రస్థాయి పరిశీలనతో తెలుస్తున్నది. దెబ్బతిన్న పంటలలో వరి, మామిడి,మక్కజొన్న, పుచ్చకాయ, తర్బూజ, టమాటలు, వంకాయలు, నువ్వులు, కూరగాయలు, పెసర్లు, జొన్న, నిమ్మ, పొద్దుతిరుగుడు, బొప్పాయి తదితర పంటలు ఉన్నాయి.
స్వ రాష్ట్రంలో రైతన్నను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సీఎం కేసీఆర్.. రాళ్లవానతో దెబ్బతిన్న పంటలతో దిగాలుపడ్డ రైతన్న వద్దకే రాష్ట్ర యంత్రాంగాన్ని పంపి వారికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నర్సంపేట ప్రాంతం లో చెట్టుకు కాయ కూడా లేకుండా వంద శాతం పంట దెబ్బతినడంతో ఎక్కువ నష్టం జరిగింది. సమైక్య పాలనలో చొప్పదండి చాలా కరువు ప్రాంతంగా, భయంకర ఎడారి ప్రాంతంలా ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక చొప్పదండే కాదు తెలంగాణనే దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చారు సీఎం కేసీఆర్.
నేడు మనదేశంలో తెలంగాణలోనే అత్యధికం గా వరి పండుతుండటం మనందరికీ ఎంతో గర్వకారణం. తెలంగాణలో వరి 56 లక్షల ఎకరాల్లో, ఇతర పంటలు దాదాపు 20, 22 లక్షల ఎకరాల్లో పండుతున్నాయి. సీఎం కేసీఆర్ దార్శనికతతో దేశంలో ఎక్కడాలేని అద్భుతమైన వ్యవసాయ విధానం తెలంగాణలో అమలవుతూ, అన్నిరకా ల పంటలతో 84 లక్షల ఎకరాలు రెండవ పంట తో సాగులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నది. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నుంచి ఉచిత సాగునీరును తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది.
గతంలో రాళ్లవానతో దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు, రైతన్నలకు ధైర్యం చెప్పేందు కు వెళ్లిన సీఎం కేసీఆర్ కు రైతులు తమ మనోగతాన్ని వినిపించారు. భూగర్భ జ లాలు పెరిగాయని, అద్భుతంగా పంటలు పండించుకుంటున్నామని, నాలుగైదేండ్ల నుంచి మం చి లాభాలు వచ్చాయని రైతులు ఆత్మవిశ్వాసంతో ఆపత్కాలంలో నూ చెప్పడం గొప్ప విషయం. దురదృష్టవశాత్తూ ఈ ఒక్కసారి నష్టం వచ్చినా సరే తట్టుకుంటా అని ఒక రైతు చెబితే సీఎం కేసీఆర్తో పాటు అందరికీ ఎంతో సం తోషం కలిగింది. సీఎం కేసీఆర్ మొక్కవోని పట్టుదలకు, పెట్టుకున్న నమ్మకానికి సత్ఫలితం కనిపిస్తుంటే ప్రతి ఒక్కరూ హర్షిస్తుండటం సహజమే.
స్వాతంత్య్ర భారతంలో దేశాన్ని పాలించినవారికి రైతులంటే ఎన్నడూ చిన్నచూపే. సీఎం కేసీఆర్ తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని మదించి అనేక సృజనాత్మక పథకాలు తెలంగాణ రాష్ర్టానికి అందించడంతో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా యి. కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.
రాష్ట్రంలో అకాలవర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.10 వేలు ప్రకటించి నాడు రైతుల వెన్నంటి నిలిచారు. ఇదే సందర్భంలో రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్ర బీజేపీ సర్కార్ తీరు దారుణంగా ఉన్నది. అకాల వర్షాలతో నష్టపోయిన తెలంగాణ రైతులకు కేంద్రం నయా పైసా ఇవ్వకుండా వివక్ష ప్రదర్శిస్తున్నది.
రైతన్నా!..నేనున్నా..’ అంటూ సీఎం కేసీఆర్ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తెలంగాణ రైతాంగానికి కొండంత అండగా నిలిచారు. రైతులు ఈ సందర్భంలో ఆత్మ ైస్థెర్యం కోల్పోవ ద్దు. రైతుల వెంట సీఎం కేసీఆర్ సదా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నది. రైతులు మరింత మనోధైర్యంతో పని చేసుకోవాలి. ఒక బృహత్తర లక్ష్యం తో ‘అబ్ కీ బార్…కిసాన్ సర్కా ర్’ అనే నినాదంతో దేశవ్యాప్తం గా విస్తరిస్తున్న కేసీఆర్ అభివృ ద్ధి, సంక్షేమాల ‘తెలంగాణ మా డల్’ రేపటి రోజున భారతదేశా న్ని బంగారుమయం చేయడం ఖాయం.
సుంకె రవిశంకర్
(వ్యాసకర్త : శాసనసభ్యులు, చొప్పదండి నియోజకవర్గం.)