ఖమ్మం కమాన్బజార్, జూలై 29 : సీ తారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరగా పూ ర్తి చేసి రైతులకు నీరివ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని సుందరయ్య భవనంలో బుధవారం నిర్వహించిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో నేపథ్యంలో ఇప్పటికే పత్తి, వరి నార్లు పోసుకున్న రైతులను ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని కోరారు. కార్యక్రమంపార్టీ నేత పోతినేని సుదర్శన్ పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొన్నారు.