పాట్నా: రోజ్ డే రోజున ఒక మహిళ తన భర్తను ఆశ్చర్యపరిచింది. గులాబీలతో పాటు మద్యం బాటిల్, గ్లాస్లో మద్యం కూడా ఇచ్చింది. ఆ తర్వాత గన్తో పోజులిచ్చింది. ఇది వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. (Bihar woman’s Rose Day) దీంతో కేసు నమోదు చేసి ఆ మహిళకు షాక్ ఇచ్చారు. బీహార్లోని ముంగేర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాంచన్ దేవికి ఇన్స్టాగ్రామ్లో సుమారు 3,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు.
కాగా, ఫిబ్రవరి 7న రోజ్ డే వీడియోను కాంచన్ దేవి పోస్ట్ చేసింది. తన భర్తకు గులాబీలు ఇచ్చింది. ఆ తర్వాత మద్యం బాటిల్, వైన్ గ్లాస్ అందించి ఆశ్చర్యపరిచింది. అలాగే బ్యూటీ పార్లర్లో పిస్టల్తో కాంచన్ దేవి పోజులిచ్చింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఈ రీల్స్ను ఆమె పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.
మరోవైపు ఈ రీల్స్ పోలీసుల దృష్టికి వెళ్లాయి. బీహార్లో మద్యంపై నిషేధం అమలులో ఉన్నది. ఈ నేపథ్యంలో భర్తకు మద్యం బాటిల్, మద్యం గ్లాస్ ఇచ్చిన కాంచన్ దేవి ఇంటిపై పోలీసులు రైడ్ చేశారు. ఆమె పోజులిచ్చిన పిస్టల్ విశాల్ కుమార్కు చెందినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
View this post on Instagram
A post shared by VB | Viral Bawaal Official – Memes | Comedy | News (@viralbawaal)
Also Read:
Woman Kills Mother | చేతబడి వల్ల తండ్రి మరణించాడన్న జ్యోతిష్కుడు.. తల్లిని చంపిన కుమార్తె
Watch: ఐదుగురిపైకి కారు దూకించిన విద్యార్థి.. ఆరేళ్ల బాలుడు మృతి
Watch: రూ.1.62 లక్షల విలువైన ఐఫోన్ చోరీ.. వీడియో వైరల్తో కానిస్టేబుల్స్ సస్పెండ్