హైదరాబాద్ : గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ ( Sevalal Jayanti ) జయంతి వేడుకలు నేడు హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరుగనున్నాయి. బంజారా బిడ్డలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. కేసీఆర్కు బంజారాల పట్ల అపారమైన గౌరవం ఉందని, అందుకే నాడు ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతికి ప్రత్యేక నిధిని కేటాయించి అధికారికంగా నిర్వహించిందని ఆమె గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.