భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమం గురించి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రాకముందు మన రాష్ట్రంలో రైతుబంధు లేదు. రైతు బీమా లేదు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు లేదు.. కాళేశ్వరం ప్రాజెక్టుతో జలకళ లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎకరానికి 10 వేల పెట్టుబడి సహాయం అందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు జలాలతో తెలంగాణ బీడు భూములన్నీ సస్యశ్యామలమయ్యాయి. అదేవిధంగా ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతు బీమా వర్తించేలా చేసి రైతుల కుటుంబాల్లో భరోసా నింపింది. రైతును రాజు చేయాలన్నదే కేసీఆర్ సంకల్పం.
ప్రస్తుత తరుణంలో పంట చేతికొచ్చే సమయానికి వడగండ్ల వానతో కూడిన ప్రకృ తి వైపరీత్యం రైతులను తీవ్ర కష్టనష్టాల పాలు చేసింది. ఇటువంటి తరుణంలో పార్టీలు, రాజకీయాలకు అతీతంగా రైతుకు బాసటగా నిలువా ల్సిన అవసరం ఉన్నది. కానీ బీజేపీ, కాంగ్రెస్ నా యకులు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
రాష్ట్రంలో రైతు సంక్షేమం గురించి ఆలోచించేది సీఎం కేసీఆర్ మాత్రమే. రైతుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇలాంటి కష్ట సమయాల్లో రైతులను ఆదుకోవాల్సింది పోయి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్నది. రైతుకు ఇంత నష్టం జరిగినా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. దీన్ని బట్టే రైతుల పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏం టో అర్థమవుతున్నది. కార్పొరేట్లకు వేలకోట్లు
రుణమాఫీ చేసే మోదీ ప్రభుత్వం, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగినప్పుడు రైతులకు నష్టపరిహారం ఇచ్చే బాధ్యత గురించి మాత్రం ఆలోచించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటుంటే కేంద్రం మాత్రం తమాషా చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నది.
గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా కేసీఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్నది. దేశంలో ఎక్కడ లేని విధంగా పంట నష్ట పరిహారం ఎకరాకు రూ.10 వేలు ప్రకటించారు సీఎం కేసీఆర్. కేంద్రం ఇచ్చే పంట నష్ట పరిహా రం రూ.3 వేలు మాత్రమే. అది కూడా తెలంగాణకు ఇవ్వడానికి కేంద్రానికి చేతులు రావు. కేసీఆర్ రైతు బిడ్డ, రైతు పక్షపాతి కనుక రైతుల్లో ధైర్యం నింపడంతో
పాటు రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. ఇటువంటి సమయంలో రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రతి పక్షాలు రాజకీయం చేయడం దుర్మార్గం. కేంద్రం నుంచి నయా పైసా కూడా తేలేని బీజేపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలి. కేటీఆర్తో పాటు తెలంగాణ మంత్రులంతా రైతులకు ధైర్యం చెప్తూ వస్తున్నారు.
గత ఏప్రిల్లో రాళ్ళ వర్షానికి దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ స్వయంగా పరిశీలించారు. నేనున్నానంటూ రైతులకు భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బతిన్న పంటలను చూసి చలించి పోయారు. ఎకరాకు 10 వేల నష్టపరిహారం ప్రకటించారు. మొత్తం 228 కోట్ల రూపాయలు కేటాయించారు. దేశంలో ఎక్కడైనా ఇలా ఇస్తున్నారా?
బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే రైతు ప్రభుత్వం. కేసీఆర్ అంటే రైతు పక్షపాతి. వ్యవసాయాన్ని ఒక పండుగలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. రైతు కంట నీరు తుడిచేది కేసీఆరే. దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు నిలిచాడు. ఈ ఏడు యాసంగిలో 56 లక్షల ఎకరాల్లో వరి పంట వే శారు. 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొన్న శ్రీరామనవమి నాటికే పెద్ద మొ త్తంలో రైతులు పంట కోత తీసి ధాన్యం కొనుగో లు కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పంట వెనుక వేసిన వారికి రాళ్ళ వర్షం వల్ల నష్టం కలిగింది. వారిని ఆదుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు నష్టం పట్ల గానీ, పరిహారం పట్ల గానీ స్పందించలేదు. పైగా రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం చిల్ల ర రాజకీయాలకు తెరలేపుతున్నారు. వారి చర్యలను యావత్ రాష్ట్రం గమనిస్తున్నది. ఈ రోజు తెలంగాణ రైతులను ఆదుకున్న ట్లే దేశంలో రైతులకు అండగా ఉండేందుకు కేసీఆర్ ‘అబ్ కీ బా ర్ కిసాన్ సర్కార్’ అంటూ ముందుకు సాగుతున్నారు.
-గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి
96669 00009