ఈ మనుషులందరి కష్టాలను తీర్చడం ఆ భగవంతుడికి వీలుకాకే అమ్మను పుట్టించాడేమో! తన కలలను చంపుకొని భర్త, పిల్లలంటూ కుటుంబ భారాన్ని మోసే ఎంతోమంది తల్లుల ఆత్మగీతమే ఈ పుస్తకం. తన శేష జీవితంలో నచ్చిన ప్రదేశాలు, దైవద
బాలల సాహిత్యం అనగానే.. అనగనగా అనే మొదలయ్యే కథలే ఎక్కువ. అవన్నీ.. పిల్లల్లో ఊహాశక్తిని పెంచే కథలే అయినా ఈ తరం పిల్లలకు ఇంకేదో కావాలి. ఆ కావాల్సిందేదో రేడియో దురికి అంకుల్గా పేరుగాంచిన బాలసాహితీవేత్త దురిక�
ఒకప్పుడు చందమామ కథలు చదువుతూ నిద్రపోయిన బాల్యం. మరి నేడు స్మార్ట్ఫోన్ దగ్గరుంటే గానీ పడుకోని దైన్యం. కథలకు ఆదరణ తగ్గిపోతుందన్న సమయంలోనే తెలంగాణ సారస్వత పరిషత్తు నేటి బాలలకు మేలైన బహుమతి అందించింది. ‘బ
ప్రపంచంలో మనం ఎక్కడికి వెళ్లి జీవించినా మన మూలాలు ఎప్పుడూ దూరం కావు. మనమే వాటికి దూరమవుతాం. ఈ కథల సంపుటిలోని కథలన్నీ ఈ తరహాలోనివే. చాలామంది తక్కువ పేజీల్లో ఎక్కువ కథలు రాస్తుంటారు. కానీ, పుస్తకంలో ఉన్నవి త�
ఇది స్త్రీవాద సాహిత్యానికి మాత్రమే చెందిన కథా సంపుటి అనుకుంటే పొరపాటే. మగవాడితో పాటు అన్నిరంగాల్లో పనిచేస్తున్న మహిళలు, కుటుంబంలోని స్త్రీల అంతరంగం గురించి ఆలోచించే ప్రతి మగవాడికీ ఈ కథా తరంగిణి చెందిన�
విప్లవోద్యమం సామాన్యులను అసమాన్యులుగా చేస్తుందనడంలో ఈ ‘వీరుడు’ ఓ సాక్ష్యం. నాడు గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, దొరలు దోపిడితో ప్రజలను పీల్చిపిప్పి చేసేవారు. అదలా ఉండగా కాలరీ ప్రాంతంలో మేనెజ్మెంట్ల ద
మహిళా కోటా పుణ్యమా అని స్థానిక ఎన్నికల్లో మహిళలను సర్పంచ్లుగా, ఎంపిటీసీ, జెడ్పీటీసీలుగా, కౌన్సిలర్లుగా గెలిపించుకుంటున్నాం. గెలువు ఎవరిదైనా పెత్తనం మాత్రం మగాడిదే! అది వేరే విషయం అనుకోండి. కానీ, ప్రస్త�
ప్రతి తల్లీ తన బిడ్డల సంతోషమే కోరుకుంటుంది. తాను ఉన్నన్ని రోజులు వారికోసమే కష్టపడుతుంది. లక్ష్మీదేవమ్మ, పద్మావతిల జీవితాలు కూడా ఈ కోవకు చెందినవే. ఉన్నత చదువులు చదివిన తన ఒక్కగానొక్క కుమారుడు రాజేంద్ర అమ�
మన జీవితాల్లోంచే కథలు పుట్టుకోస్తాయనడానికి ఈ పుస్తకమే సాక్ష్యం. మధ్యతరగతి జీవితాలను కథా వస్తువులుగా చూపించే ప్రయత్నంలో రచయిత సఫలీకృతమయ్యారు. ఈ నిశ్శబ్ద ఖడ్గంలో ఉన్న పద్నాలుగు కథల్లోని అంతిమ సారాంశం సమ
ఇందులోని కథల్లో కొన్ని పులకింతలు పెడితే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి. ఆర్థిక, సామాజిక, రాజకీయ నేపథ్యంలో జరుగుతున్న అనేక పరిణామాలను కథావస్తువులుగా ఎంపిక చేసుకొని పుస్తకంగా ప్రచురించిన ప్రయత్నం బాగుంది.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి ఈ రచయిత్రి ఒక ఉదాహరణ. 40 అంతస్తుల ఈ కవితా కోటలో ఒకో అంతస్తు ఓ విలువైన జీవిత పాఠం. అందరి జీవితాల్లో దాగున్న కష్టాలు, కన్నీళ్లు, బడలిక నుంచి బయటపడేలా చేస్తాయి ఇందులోని ర�
‘సిక్కా’ అనే మాట విన్నప్పుడు.. అది ఒక విలుప్తమైన పదంగా అనిపిస్తుంది. అనిపించడం కాదు.. అది వాస్తవం కూడా. ‘సిక్కా’ అనే పదం.. ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. ఈ పదానికి ‘నాణెం’ అనే అర్థంలోనే వాడుక ఎక్కువగా ఉండేది
లోకం బాధను తన బాధ అనుకొని రాసే రచయితలు అరుదుగా ఉంటారు. అనుకోనిది రచయిత కె.వి.ఎస్.వర్మ ఆ కోవకే చెందుతారు. ఈ సంకలనంలో ఉన్న 21 కథల్లో విభిన్నమైన ఆలోచనలు దాగున్నాయి. తొలి కథలోనే రచయితలు రాసే కథలు, వారి నిజజీవితా�
చిక్కటి పాలు పొయ్యి మీద పెట్టి, సన్న సెగ రాగానే ఇంత చాయపత్తా వేసి, అందులోనే అల్లమింత వేసి, రెండు యాలకులు దంచి కొట్టి.. రెండు పొంగులు వచ్చేదాకా మరగనిచ్చి, తగినంత చక్కెర వేసి.. మరో పొంగు వచ్చాక.. వడగట్టుకున్న చా�
ప్రతి మనిషిలోనూ ఆలోచనలు, సంఘర్షణలు, మనసుని బాధపెట్టిన విషయాలు అనేకం ఉంటాయి. అవన్నీ మాటల రూపంలో మాత్రమే బయటికి వస్తుంటాయి. ఎంత ముఖ్యమైనవైనా కూడా.. కొన్ని వారాలపాటు మాత్రమే చెప్పినవారికి, విన్నవారికి గుర్త�