(Jobs @ BEL) భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) లో ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మచిలీపట్నం యూనిట్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఈఎల్ నోటిఫికేషన్ ప్రకారం.. ఎలక్ట్రానిక్స్లో 6, మెకానికల్లో 6, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 3 పోస్టులతో పాటు మొత్తం 15 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్/బీఎస్పీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండేండ్ల అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు 01.11.2021 నాటికి 28 ఏండ్ల వయసు మించకూడదు. నెలకు రూ.35,000 జీతంగా నిర్ణయించారు.
బీఈ / బీటెక్ / బీఎస్సీ (ఇంజినీరింగ్), అనుభవం, వైవా వాయిస్లో మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకుగాను.. అర్హత పరీక్షలో సాధించిన మార్కులకు 75 మార్కులు, అనుభవానికి 10 మార్కులు, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు www.bel-india.in లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలాగే, మేనేజర్ (హెచ్ఆర్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్, మచిలీపట్నం- 521001, ఆంధ్రప్రదేశ్ చిరునామాకు దరఖాస్తులు పంపాలి. దరఖాస్తుల దాఖలుకు చివరి తేదీ 24.12.2021.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..