(Kidnapper arrest) రాజమండ్రి: ప్రేమిస్తున్నానంటూ ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుని పథకం ప్రకారం బయటకు తీసుకెళ్లి కిడ్నాప్ చేసిన ఒక యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్ పోలీస్ జిల్లా కార్యాలయంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి అరెస్ట్ వివరాలు వెల్లడించారు.
ఎస్పీ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భీమవరం కొత్త పూసలమర్రు నివాసి మోకా ఫణీంద్రకు రాజానగరం మండలం తోకాడకు చెందిన యువతితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆమెతో చాటింగ్ చేస్తూ.. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. పథకం ప్రకారం ఆమెను ఈ నెల 15న లాంగ్ డ్రైవ్కు తీసుకెళ్తానని చెప్పిన ఫణీంద్ర రాజానగరం వచ్చాడు. యువతిని బైక్పై ఎక్కించుకుని భీమవరం సమీపంలోని బలుసుమూడి 31వ వార్డులోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె బంగారు గొలుసు, చెవి దుద్దులు తీసుకున్నాడు. అనంతరం ఆమె కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు. ఆమె తండ్రికి ఫోన్ చేసి రూ.5 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని బెదిరించాడు. యువతి తల్లిదండ్రులు రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 8 బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చేపట్టారు.
ఇంట్లో బందీగా ఉన్న యువతి తలుపులు పగలకొట్టింది. ఇది గమనించిన స్థానికులు బలుసుమూడి పోలీసు ప్రతినిధి గంగాభవానికి సమాచారం అందించారు. ఆమె టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు రంగంలోకి దిగి యువతిని రక్షించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన బలుసుమూడి 31వ వార్డు మహిళా పోలీసు గంగాభవానీని నగదు పురస్కారం, ప్రశంసాపత్రంతో ఎస్పీ సత్కరించారు.
అధిక బరువుతో విసిగిపోయారా.. అయితే ఈ పండ్లు తినండి..!
కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..