(Board on Road) తూర్పుగోదావరి : అనపర్తిలో మరమ్మతు పనులు జరుగుతున్న రోడ్డుపై ఓ వ్యక్తి ఏర్పాటుచేసిన బోర్టు వైరల్గా మారింది. ‘జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త’ అంటూ హెచ్చరిస్తూ బోర్డునొకదాన్ని ఏర్పాటుచేశాడు. అంతటితో ఆగకుండా ఈ బోర్డును రోడ్డు వేసే వరకు ఉంచాలని, కాదని ఎవరైనా తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఇంతకీ ఈ బోర్డు ఏర్పాటు చేసిన వ్యక్తి బాధేంటో అర్థం కావడం లేదు. పనులు జరుగుతున్నాయని చెప్పడానికా.. లేక పనులు నాసిరకంగా జరుగుతున్నాయని హెచ్చరించడానికా అనేది స్థానికులు తేల్చుకోలేకపోతున్నారు.
అనపర్తిలో సామర్లకోట-వేమగిరి రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఇదే రోడ్డుపై అనపర్తి శివారులో ద్వారపూడి వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి వినూత్నంగా బోర్డు ఏర్పాటుచేశారు. జగన్ ఉన్నారు, జాగ్రత్త అంటూ హెచ్చరికతో కూడిన బోర్డును పెట్టాడు. రోడ్డు వేసే వరకు ఈ బోర్డును ఎవరూ తీసేయవద్దని, ఒకవేళ ఎవరైనా తొలగిస్తే వారు, వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతారని భయపెట్టే ప్రయత్నం చేశారు. ఈ బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా సదరు వ్యక్తి పనులు సక్రమంగా జరుగాలని కాంట్రాక్టర్ను బెదిరిస్తున్నాడా? లేక జగన్ సీఎంగా ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాడా? అనేది స్థానికులు తేల్చుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా గతుకులతో ఉన్న రోడ్డు మరమ్మతు పనులు సక్రమంగా చేపడితే అదే పది వేలని అనపర్తి, పరిసర గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..