నాగ్పూర్: ఐఏఎఫ్ అధికారి భార్యపై అత్యాచారం చేయడమే కాక, ఆ దృశ్యాలను రికార్డు చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడి, తర్వాత ఆమెను బలవంతంగా మతమార్పిడి చేసిన వ్యక్తిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. మత మార్పిడి యత్నానికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. 24 ఏండ్ల మహిళ భర్త నాగ్పూర్ వెలుపల ఐఏఎఫ్ అధికారిగా పనిచేస్తున్నాడు. ఆ మహిళ నాగ్పూర్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేది. ఈ క్రమంలో పాఠశాల రోజుల్లో పరిచయస్తుడైన అయ్యాజ్ తాజే మదారే ఆమెకు వ్యాపారంలో సహాయం చేసేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో ఒక రోజు హోటల్కు తీసుకువెళ్లిన అతడు బాధితురాలికి గుర్తు తెలియని ద్రావణాన్ని తాగించాడు.
తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇలా ఆమె వద్ద రూ.4 లక్షలు వసూలు చేశాడు. తర్వాత మే 31న ఆమెను మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాకు తీసుకువెళ్లి ఆమెను మత్తులో ఉంచి మత మార్పిడీ తతంగాన్ని నిర్వహించాడు. ఆమె మతం మారిందని మౌలానా ప్రకటించడమే కాక, ఆమె మదారేను వివాహం చేసుకుందని తెలిపాడు. దీంతో బాధితురాలు భర్తకు ఈ విషయం చెప్పి సోనెగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి మదారే, అతనికి సహాయం చేసిన మౌలానా, మరికొందరిని అరెస్ట్ చేశారు.