తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపు మేరకు తొలిరోజు జాతీయ సమైక్యతా ర్యాలీలు నిర్వహించారు.
దేశానికి గాంధీ ఎలాగో.. తెలంగాణకు కేసీఆర్ అలాంటివారే. తెలంగాణలో అన్ని మతాల వారు గంగాజమునా తహెజీబ్గా కలిసి మెలిసి జీవిస్తున్నారు. విలీనంపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నది.
ప్రశాంత హైదరాబాద్లో శాంతి భద్రతలను దెబ్బతీసే శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన సెప్టెంబర్ 17నే జాతీయ సమైక్యతా దినోత్సవంగా పాటిస్తున్నాం.
బీజేపీ నాయకులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదు.
సీఎం కేసీఆర్ సమర్థ నాయకత్వంలో ఎనిమిదేండ్లలోనే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్ర ప్రగతిని చూసి పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు.
గాడ్సే వారసులు. స్వాతంత్య్ర ఉద్యమానికి, రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీ నాయకులకు, ఆ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. రాజకీయ లబ్ధి కోసమే ‘విమోచనం పాట’ పాడుతున్నారు.
సందపను సృష్టించి ప్రజలకు పంచడమే సీఎం కేసీఆర్ ధ్యేయం. చావు నోట్లో తల పెట్టి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకోవడం గర్వకారణం.
ఎనిమిదేండ్లలోనే కనీవినీ ఎరుగని అభివృద్ధి సాధించి తెలంగాణ దేశానికే దిక్సూచిగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దే.
Minister Indrakaran Reddy | ఓజోన్ పొర భూమిని కాపాడుతోందని.. వాతావరణంలో సహజ రక్షణ పొరగా ఉన్న దీన్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
Minister Errabelli | మహాత్మ గాంధీజీని చంపిన గాడ్సే వారసులెవరో బీజేపీ ప్రజలకు చెప్పాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
Minister Harish Rao | అంబలి కేంద్రాల తెలంగాణ నుంచి ఎనిమిదేండ్లలో దక్షిణ భారత ధాన్యగారంగా తెలంగాణను మార్చుకున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.