చరిత్రను వక్రీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయి. అనేకమంది అమరుల త్యాగాల పునాదులపై రాష్ట్రానికి స్వేచ్ఛ లభించింది. కానీ, ఈ పోరాటంతో సంబంధంలేని కొందరు ఈ చారిత్రక సందర్భాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వినియోగించుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అలాంటి వారిని తరిమికొట్టాలి.
– మంత్రి కొప్పుల ఈశ్వర్