తెలంగాణలోని గిరిజనులు, ఆదివాసీల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక సమస్యతో ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా విషయం తెలుసుకున్న ప్రియురాలు సైతం పురుగుల మందు సేవించింది.
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
తెలంగాణ సుభిక్షం కోసం సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రాజెక్టులను కూలగొడుతామని హెచ్చరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణలో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు.
ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ భరత మాత ముద్దుబిడ్డ అని, ఆయన చరిత్ర స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సూర్యాపేట జిల్లాలో భూకంపం వచ్చింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది.
తెలంగాణలో శాంతి భద్రతల పర్యవేక్షణతో పాటు పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పోలీసులు పనిచేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశంసించారు.
ప్రతి ఒక్కరూ దైవ చింతనను అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు ఎన్ని అవాంతరాలు వచ్చినా పూర్తి చేసి తీరుతామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.