హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కాల్వలపై నూతన వంతెనల నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది.
అనుముల మండలం పేరూరు గ్రామంలోని భువనేశ్వరీ సమేత స్వయంభూ సోమేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయానికి పునర్వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పట్టణ జనాభాతోపాటు వివిధ పనుల కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో మిర్యాలగూడ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇందుకు సరిపడా మార్కెట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సోమవారం ముగింపు ఉత్సవాలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లి�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో కార్తిక సందడి నెలకొన్నది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో స్వయంభూ ఆలయం, అనుబంధ రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఆస్తి పాస్తులు లేకున్నా పూరి గుడిసెలో ఉంటూ రెక్కలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కడుబీద కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. ఎందరో ఇళ్లలో వెలుగులు నింపిన అతడి కుటుంబం ప్రస్తుతం అంధకారంలో మునిగిపోయింది.
సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్య శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చింది.
తెల్ల బంగారం మెరిసిపోతున్నది. రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో మంచి ధర పలుకుతున్నది. సీసీఐ మద్దతు ధర క్వింటాల్కు రూ.7,200 దాటి ఎవ్వరూ ఊహించని విధంగా 8వేల పైకి ఎగబాకి�
ప్రజావాణిలో ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆమె పాల్గొని ప్రజల నుంచి వ
జిల్లాలో సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో స్త్రీ నిధి రుణాలు అందజేస్తున్నారు. జిల్లా వ్యా ప్తంగా 19,154 పొదుపు సంఘాలు ఉండ గా.. వీటిలో 1,93,090 మంది సభ్యులు ఉన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చొరవతో వచ్చిన మెడికల్ కళాశాల ప్రజలకు వరంగా మారింది. ప్రసవాల్లో రాష్ట్రంలోనే టాప్లో నిలువగా ఆపరేషన్లు లేకుండా సాధారణ ప్రసవాల్లో రాష్ట్రంలోన
నాటి ఉద్యమాలకు కేంద్రాలుగా మన గ్రంథాలయాలు ఎంతగానో దోహదపడ్డాయని, ఆ సమయంలో సూర్యాపేట గ్రంథాలయం ఉద్యమానికి పురుడుపోసిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.