నకిరేకల్, డిసెంబర్ 19 : అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నియోజకవర్గ స్థాయి పాస్టర్ల సమావేశం సోమవారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిస్మస్ను క్రైస్తవులు ఘనం గానిర్వహించుకోవాలని సూచించారు. క్రైస్తవులకు ప్రభుత్వం ప్రతి ఏడాది క్రిస్మస్ కానుక అంద జేస్తున్నదని గుర్తు చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్చైర్ పర్సన్ మురారిశెట్టి ఉమారాణీ కృష్ణమూర్తి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ప్రగడపు నవీన్రావు, పట్టణాధ్యక్షుడు యల్లపురెడ్డి సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఎల్ఓసీ అందజేత
కట్టంగూర్ : మండలంలోని ఎర్నేనిగూడేనికి చెందిన బండమీది మమతకు సీఎం సహాయ నిధి నుంచి రూ. 2.50 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. సంబంధిత పత్రాన్ని నకిరేకల్లోని క్యాంపు కార్యాలయంలో బాధితురాలి కుటుంబసభ్యులకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ఫండ్ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సిరిగిరెడ్డి వినోదా శేఖర్రెడ్డి, ఎంపీటీసీ ఎడ్ల పురుషోత్తంరెడ్డి, ఉప సర్పంచ్ ఆకటి వెంకన్న, శ్రీరామోజు సత్యనారాయణ చారి పాల్గొన్నారు.
18 పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు
కట్టంగూర్ : గ్రామ పంచాయతీలకు శాశ్వత భవనాలు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో 18 పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు చేసిందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కట్టంగూర్ మండలంలో రామచంద్రాపురం, భాస్కర్లబాయి, మల్లారం, చిట్యాల మండలం ఆరెగూడెం, రామన్నపేట మండలం నిర్నెంల, బి.తుర్కపల్లి, కొమ్మాయిగూడెం, కొత్తగూడెం, ఉట్కూరు, నకిరేకల్ మం డలం మోదినిగూడెం, నడిగూడెం, నార్కట్పల్లి మండలం బాజకుంట, గోపలాయిపల్లి, జువ్విగూడెం, తిరుమలగిరి, కేతేపల్లి మండలం చీకటిగూడెం, ఇప్పలగూడెం, కొప్పోలు పంచాయతీ భవనాలకు నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, గుంటకండ్ల జగదీశ్రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.