న్యూఢిల్లీ, ఆగస్టు 12: గడచిన మూడేండ్లుగా రావల్పిండిలోని అడియాలా జైలులో మగ్గుతున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ సజీవంగా ఉన్నారా? పాకిస్థానీ జర్నలిస్టు వజహత్ సయీద్ ఖాన్ చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై నెలకొన్న భయాందోళనలను మరింత పెంచాయి.
ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఈ జర్నలిస్టు ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మరణించి ఉండవచ్చని ముగ్గురు సీనియర్ సైనిక వర్గాలు తనకు చెప్పినట్టు పేర్కొన్నారు. మాజీ ప్రధాని ఆరోగ్యం పట్ల ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఆయనను కలిసేందుకు తమకు అనుమతి నిరాకరించారని ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.