నాగారం, డిసెంబర్ 19 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత భావనను పెంపొందించుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం నాగారం మండలం వర్ధమానుకోటలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మండపం, పశు వైద్యశాల, పల్లె ప్రకృతివనం, వైకుంఠధామాలను ప్రారంభించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్నందున పార్టీ సీనియర్ నాయకుడు పాటి లక్ష్మీనర్సింహారెడ్డి పరామర్శించారు.
మాచిరెడ్డిపల్లె గ్రామశాఖ అధ్యక్షుడు మోరగుండ్ల యల్లేశం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ కూరం మణీవెంకన్న, గుండగాని అంబయ్య, సర్పంచ్ బోయిని శోభాలింగమల్లు, ఎంపీటీసీలు ఈరేటి స్వప్నాఅంజయ్య, వడ్డె పరుశరాములు, ఉప సర్పంచ్ ఈదుల కిరణ్కుమార్, మార్కెట్ వైస్ చైర్మన్ యారాల రాంరెడ్డి, ఆలయ చైర్మన్ పోతులూరు రమాదేవి, రామబ్రహ్మం, రమేశ్, బాలమల్లు, నాయకులు పాల్గొన్నారు.