Earthquake : అరుణాచల్ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్) ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ భూకంపంవల్ల ఎలాంటి ప్రాణనష్టంగానీ, ఆస్తి నష్టంగానీ జరగలేదు.
నేషనల్ సెంటర ఫర్ సిస్మాలజీ అధికారుల వివరాల ప్రకారం.. ఉదయం 5.45 గంటలకు అప్పర్ సియాంగ్ జిల్లాలోని పాంగిన్కు సుమారు 116 కిలోమీటర్ల దూరంలో, భూమికి 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రధాన భూకంపానికి ముందు అదే ప్రాంతంలో వరుసగా మూడు స్వల్ప ప్రకంపనలు నమోదైనట్లు వెల్లడించింది.