మిర్యాలగూడ రూరల్, డిసెంబర్ 20 : మిర్యాలగూడ మండలంలోని బి.అన్నారం ప్రాథమిక వ్యసాయ పరపతి సంఘం(పీఏసీఎస్)అభివృద్ధి పథంలో, లాభాల బాటలో పయనిస్తూ ఇతర సహకార సంఘాలకు ఆదర్శంగా నిలుస్తుంది. సంఘం పరిధిలో మిర్యాలగూడ మండలం బి.అన్నారం, చెంచయ్యగూడెం, గద్దగూటితండా, త్రిపురారం మండలం బొర్రయపాలెం, బుడ్డితండా, లోక్యాతండా, దామరచర్ల మండలం కేజేరెడ్డి కాలనీ, పెద్దతండాలో మొత్తం 858 మంది సభ్యులు(రైతులు) ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా సంఘం పని తీరును పరిశీలిస్తే 2009 వరకు రూ.14 .36 లక్షల నష్టాల్లో కూరుకుపోయింది. ఈ నష్టాలు 20013-14 వరకు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతుల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో సంఘానికి నిధుల రాక, సంఘం నిర్వాహకుల పనితనం మారడంతో 2014-15 నుంచి లాభాల బాట పట్టింది.
వంద శాతం రుణాల రికవరీ రైతులు తీసుకున్న రుణాలను నిర్ణీత కాలంలో చెల్లించడంలో ముందున్నారు. దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతుల నుంచి 100 శాతం, స్వల్పకాలిక రుణాలు పొందిన వారి నుంచి 95 శాతం రికవరీ చేయడంతో జిల్లాలోనే ఉత్తమ స్థానంలో నిలిచింది.
2019-20లో రూ.11,16,046, 2020-21లో రూ.2,44,746, 2021-22లో రూ.11,11,136 వరుసగా మూడు సంవత్సరాలు లాభాల బాటలో నడిచింది. సంఘం ఆర్థికంగా బలపడడంతోపాటు అభివృద్ధి బాటలో పయనిస్తుంది. సహకార సంఘానికి ప్రహరీ నిర్మాణం, అనుబంధంగా రూ.21 లక్షలతో 308 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఎరువుల గోదామును నిర్మించారు. అదేవిధంగా నూతనంగా రైతులకు బంగారు ఆభరణాలపై రూ.కోటి రుణాల మంజూరుకు అవకాశం కల్పించింది.
బి.అన్నారం సహకార సంఘం రైతు సేవలో తరిస్తుంది. రైతులకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రుణాలతోపాటు సీజన్ వారీగా వానకాలం, యాసంగికి రైతులకు కావాల్సిన విత్తనాలు, ఎరువులను సంఘం ద్వారా అందజేస్తున్నారు.
నాబార్డు సాయంతో సహకార సంఘం నుంచి రైతులకు స్వల్ప, దీర్ఘకాలిక రుణాలు అందజేస్తారు. 2019-20లో స్వల్పకాలిక రుణాలు రూ.2,26,91,936, 2020-21లో రూ.2,30,46,806, 2021-22లో రూ.2,40,49,050, 2022-23లో 2,53,60,355, దీర్ఘకాలిక రుణాలు 2019-20లో రూ.71,56,386, 2020-21లో రూ.87,40,406, 2021-22లో రూ.1,29,93,421 రుణాలను రైతులకు అందజేశారు. దీర్ఘకాలిక రుణాల్లో భాగంగా రైతులకు హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, గొర్రెలు, బర్రెల కోసం రుణాలు ఇచ్చారు. అంతేకాకుండా గత వేసవిలో రైతులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. నాబార్డు ద్వారా 30 మంది రైతులకు ద్విచక్రవాహనాల కోసం రూ.15.34 లక్షల రుణాలు అందజేశారు. పీఏసీఎస్ పని తీరును ప్రశంసించి 2016లో ప్రహరీ నిర్మాణానికి నాబార్డు రూ.3లక్షలు అందజేసింది.
రైతులు అడిగిన వెంటనే రుణాలు ఇస్తున్నారు. అంతేకాకుండా స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలపై అగాహన కల్పిస్తున్నారు. సీజన్కు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నారు. సంఘంలో పనిచేసే ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తూ రైతులకు సహకరిస్తున్నారు.
-అంబటి శ్రీనివాస్రెడ్డి, రైతు, బి.అన్నారం
నష్టాల్లో ఉన్న సం ఘాన్ని అధికారులు, సిబ్బంది సహకారంతో లాభాల బాటలోకి తీసుకొచ్చాం. రైతులు అడిగినన్ని రుణాలు ఇచ్చేందుకు అధికారులు సహకరిస్తున్నారు. నాబార్డు సహకారంతో బైక్ రుణాలు అందిస్తుండడంతో రైతులు వ్యవసాయ అనుబంధ పాడి, కూరగాయలను మార్కెట్కు తరలించేందుకు ఉపయోగిస్తున్నారు.
-పడిగపాటి వెంకట్రెడ్డి, సంఘం సీఈఓ,
రైతులు, బ్యాంక్ అధికారుల సహకారంతో సం ఘాన్ని లాభాల బాట పట్టించాం. రుణాలివ్వడంలో, వసూళ్లు చేయడంతో ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారు. పీఏసీఎస్ భవనానికి ప్రహరీ నిర్మాణం, క్యాష్ కౌంటర్ ఏర్పాటు, ఎరువులు, విత్తనాలకు గోదాము నిర్మించాం. త్వరలోనే పెట్రోల్ బంక్ను ఏర్పాటు చేసి రైతు సేవలో తరిస్తాం.
-అంబటి వెంకట్రెడ్డి, సంఘం చైర్మన్