Superstar Mahesh Babu | టాలీవుడ్ సూపర్స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు పండగలా జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. అయితే ఈ ప్రత్యేక సందర్భాన్ని మరింత ఖరారు చేస్తూ, మహేష్ బాబు మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’కి సంబంధించిన మేకర్స్ కొన్ని ప్రత్యేక స్టిల్స్ను విడుదల చేసి అంచనాలను తారాస్థాయికి చేర్చారు.
మరోవైపు, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న ఒక క్యూట్ ఫ్యామిలీ పిక్చర్ మరియు బర్త్ డే పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. “హ్యాపీ బర్త్ డే ఎంబీ! ప్రతి రోజును ఇంత ప్రత్యేకంగా మలిచినందుకు ధన్యవాదాలు. నీకు ఎల్లప్పుడూ ప్రేమ, మంచి ఆరోగ్యం, అంతులేని సంతోషం కలగాలని కోరుకుంటున్నాను. మేము నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాము” అంటూ నమ్రత రాసుకొచ్చిన భావోద్వేగపు మాటలు మహేష్ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాయి.
ఇదిలాఉంటే.. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొన్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకధీర ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించి ప్రస్తుతం కేవలం 15 శాతం షూటింగ్ మాత్రమే బాలన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్స్ అన్నింటినీ త్వరలోనే పూర్తి చేసుకుని, మహేష్ బాబు కొద్దిపాటి విరామం తీసుకున్న అనంతరం తన తదుపరి ప్రాజెక్ట్పై దృష్టి పెట్టనున్నారని సమాచారం. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
View this post on Instagram