హాలియా, డిసెంబర్ 19 : రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. సోమవారం హాలియాలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన హాలియా మసీదు కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాలియాలో షాదీఖాన ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలోని మైనార్టీ నాయకుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం అందిస్తున్నట్లు చెప్పారు.
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులు అందించడంతో పాటు పేదింటి ఆడబిడ్డ పెండ్లికి షాదీముబారక్ ద్వారా రూ. 1,00,116 అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మసీద్ కమిటీ అధ్యక్షుడు అన్వరొద్దీన్, సభ్యులు డాక్టర్ జావెద్, సుభాని, అబ్దుల్ రషీద్, ముథహర్, మహ్మద్ రషీద్, బాబా, ఆసిఫ్ ఖాన్ పాల్గొన్నారు.