నల్లగొండ : జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గంలోని రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్ లో చేరిన ప్రతీ కార్యకర్త క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసి నియోజకవర్గ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మారిపోయాయని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో శివగల స్వామి, నల్ల యాదయ్య, చిన్నపాక సురేశ్, పుట్టల దానయ్య, చిన్నపాక విజయ్, నల్ల కిష్టయ్య, చిన్న లచ్చి కృష్ణ స్వామి, నరేశ్, బిక్షమయ్య మహేశ్, వీర్లపల్లి ప్రవీణ్, శివగల నరేశ్, నల్ల జనార్దన్ రాజరత్నం, నరేందర్, భాస్కర్, శంకర్, యాదయ్య రామచంద్రం తదితరులు ఉన్నారు.