చివ్వెంల, డిసెంబర్ 19 : రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయాన్ని భక్తులు నిత్యం సందర్శించేలా తీర్చి దిద్దుతామని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్పల్లిలోగల పెద్దగట్టు ఆలయ ఆవరణలో లింగమంతుల స్వామి దేవస్థాన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే మన వనరులు మనకు దక్కుతాయని ఆనాటి ఉద్యమనాయకుడు సీఎం కేసీఆర్ ఆనాడే రని గుర్తు చేశారు.
తెలంగాణ సమాజం ఒక అద్భుతమైన మానవీయమైన సంస్కృతికి, సాంప్రదాయానికి నిలయంగా ఉందన్నారు. ఇంత గొప్ప సంస్కృతిని లేకుండా చేయాలని ఉమ్మడి పాలకులు కుట్రలు చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కాబట్టే, అన్నింటిపై అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మన ప్రాంత జాతరలు, పండుగలకు పూర్వ వైభవం తీసుకొచ్చారన్నారు. పెద్దగట్టు జాతరకు అడిగినన్ని నిధులు విడుదల చేసి మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారన్నారు. రూ. 7 కోట్లతో భక్తుల సౌకర్యార్థం జాతర వరకు అవసరం ఉన్న పనులతో పాటు, శాశ్వత పనులైన కోనేరు, కల్యాణ కట్ట, పూజార్లకు గదులు, గెస్ట్ హౌజ్, సోలార్ లైట్లు, సీసీ కెమెరాలు, సిమెంట్ రోడ్లు, నిర్మించుకున్నట్లు తెలిపారు.
కొత్తగా ఏర్పాటైన పాలక వర్గం చర్చించుకొని ఇంకా కావాల్సిన నిధులు, పనులు తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. యాదవులు కోరిన విధంగా గుట్ట చుట్టూ ఆక్రమణకు గురైన భూమి ఆలయానికి చెందే విధంగా జిల్లా కలెక్టర్, ఆర్డీఓతో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గట్టు ముందున్న చెరువు చుట్టూ మినీ ట్యాంక్బండ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. దాంతో పాటు యాదవ భవనం పెద్దగట్టు ప్రాంతంలో నిర్మించేందుకు చర్యలు చేపడతానన్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఎంపీ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీహాల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయ చైర్మన్ కోడి సైదులుతోపాటు డైరెక్టర్లు మట్టిపల్లి శ్రీనివాస్ యాదవ్, జటంగి వెంకటేశ్వర్లు యాదవ్, కాసా శ్రీనివాస్ యాదవ్, చింతకాయల జానయ్య యాదవ్, మెంతబోయిన సింహాద్రి, మొండికత్తి దుర్గమ్మ, మొంతబోయిన వెంకన్న యాదవ్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి, ఈఓ కుశలయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సవరాల సత్యనారాయణ, కౌన్సిలర్ లక్ష్మి, చివ్వెంల మండలాధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, పెన్పహాడ్ ఎంపీపీ నెమ్మాది భిక్షం, బూరబాల సైదులు పాల్గొన్నారు.