న్యూఢిల్లీ, ఆగస్టు 12: జంతర్ మంతర్ సీజన్ 2 అతి త్వరలోనే ప్రారంభం కానుందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జార్ఖండ్లో విద్యార్థులు జరిపిన ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు. విద్యార్థులు హక్కుల కోసమే తప్ప, ఓటు బ్యాంక్ కోసం పోరాటం చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
జూలై 20న ఢిల్లీలో ప్రవర్తించిన విధంగానే రాంచీలో కూడా పోలీసులు విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరించారని దీప్కే ఆరోపించారు. సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇకనైనా ప్రభుత్వం వీటిపై తప్పక దృష్టి సారించాలని అసుతోష్ అన్నారు.