అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే, ముఖ్యమంత్రి మాత్రం విదేశాల్లో విహరిస్తున్నారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి ఖమ్�
జిల్లాలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మోత్కూరు అడ్డగూడూరు, ఆత్మకూరు(ఎం), గుండాల మండలాల్లో అకాల వర్షంతో రైతులు ఆగమాగమయ్యారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ, చారగొండ, అచ్చంపేట, ఉప్పునుంతల, అమ్రాబాద్, బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజిపేట మండలాల్లో గాలివానతో వడగండ్లు పడ్డ
ధాన్యం దళారుల పాలవుతున్నది. కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం.. పట్టింపులేమితో మధ్య వ్యాపారుల పంట పడుతున్నది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టకపోవడంతో పంట కుప్పలు తెప్పలుగా పేరుకు
కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు దిక్కూ మొక్కూ లేకుండా పోతున్నది. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతన్నలంతా ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15వేల చొప్పున రెండు �
ఎస్సారెస్పీ చివరి ఆయకట్టు రైతాంగం తల్లడిల్లుతున్నది. చేతికందే దశలో ఉన్న పంటలకు సాగు నీటి కోసం అరిగోస పడుతున్నది. అందుకు జూలపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని పంటల దుస్థితే నిదర్శనంగా నిలుస్తుండగా, రైతన్�
మత్తడి వాగు ప్రాజెక్టు పరిధి కుడి, ఎడమ కాలువల పరిధిలో జొన్న, మక, కూరగాయలు, వేరుశనగ పంటలు సాగవుతున్నాయి. కుడి కాలువ ఆయకట్టు 1200 ఎకరాలు, ఎడమ కాలువ ఆయకట్టు 8,500 ఎకరాలు ఉంటుంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కుడి కాలువను
గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించే ఉపాధి హామీ పథకం అమల్లో జవాబుదారీతనం లోపిస్తున్నది. గ్రామాల్లో వసతుల కల్పనకు, వ్యవసాయ తోడ్పాటుకు, రైతులకు ఆసరాగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకం అమలు తీరుపై ఏటేటా ఫిర్యాదుల�
రీజినల్ రింగ్రోడ్డు(ట్రిపుల్ఆర్) ఉత్తరభాగం భూసేకరణలో ప్రతిష్టంభన నెలకున్నది. ప్రభుత్వం ఎకరాకు రూ. 12-15లక్షలు మాత్రమే పరిహారం ఆఫర్ చేస్తుండగా, బహిరంగ మార్కెట్ ధర చెల్లిస్తేనే భూములిస్తామని రైతులు స�
పెట్టుబడి సాయం రానేలేదు.. రుణమాఫీ పూర్తి కాక నేపాయె.. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వడ్లు కొనే దిక్కులేదు.. వర్షాలతో పంటలు నష్టపోతుంటే ఓదా ర్చే తీరిక లేదు.
భూ భారతి పేరిట పర్యటిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతకలు రైతులకు చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రా
చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వం సాగునీరు అందించి పంటను బతికించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా జూలపల్లిలో శనివారం ఆందోళనకు దిగారు.
ఏప్రిల్ 20వ తేదీ ఆదివాసీ పోరాట చరిత్రలో మరువలేని జ్ఞాపకం. దేశ స్వాతంత్య్రానికి ముందు నైజాం పాలనలో జోడే ఘాట్ కేంద్రంగా సాగిన కుమ్రం భీం భూపోరాటానికి కొనసాగింపుగా జరిగిన ఇంద్రవెల్లి గోండు రైతుల ఉద్యమాని