రాయికల్ : ముదిరాజ్లకు ( Mudirajs ) విద్యా , ఉద్యోగాల్లో ఆశించిన మేర అవకాశాలు లభించక పోవడం బాధాకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి (T Jeevan Reddy) అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగలో పాల్గొని మాట్లాడారు. ముదిరాజ్లు కాయ కష్టానికి ప్రతీక అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ముదిరాజ్లకు విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు రాకపోవడం విచారకరమన్నారు. గతంలో ముదిరాజ్లను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా బీసీ ఏ లో కలిపే విధంగా నిర్ణయం చేశారని, అది న్యాయస్థానంలో నిలిచిపోవడం అమలుకు నోచుకోలేకపోయిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి కులవృత్తులను ప్రోత్సహించే విధంగా పలు అభివృద్ధి చర్యలు తీసుకున్నారని వెల్లడించారు.