Today History : ప్యారిస్లోని లౌవ్రే మ్యూజియం నుంచి దొంగతనానికి గురైన ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా పెయింటింగ్ను 1913 లో సరిగ్గా ఇదే రోజున పోలీసులు పట్టుకున్నారు. మోనాలిసా పెయింటింగ్కు ఫ్రేమ్ తయారుచేసిన శిల్పకారుడే దొంగ అని తేలడంతో.. పెయింటింగ్ను స్వాధీనం చేసుకుని పోలీసులు తిరిగి లౌవ్రే మ్యూజియంకు తరలించడంతో కథ సుఖాంతమైంది. ఈ పెయింటింగ్లో ఉన్న మోనాలిసా చిరునవ్వు, ఆకృతి, రంగు, అందం కారణంగానే ఆ పెయింటింగ్ను దొంగతనం చేసినట్లు దొంగ ఒప్పుకున్నాడు.
ప్యారిస్లోని లౌవ్రే మ్యూజియంలోని పెయింటింగ్స్పై గ్లాస్ ఫ్రేమ్లు, ఇతర ఆర్ట్వర్క్లు చేయడం ప్రారంభించారు. చాలా మంది కళాకారులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. పెయింటింగ్లను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలిస్తున్నారు. ఇంతలో మోనాలిసా పెయింటింగ్ అదృశ్యమైంది. మోనాలిసా పెయింటింగ్ని కూడా ఆర్ట్వర్క్ కోసం ఎక్కడికో తీసుకెళ్లి ఉంటారని మ్యూజియం కాపలాదారు భావించాడు. మరుసటి రోజు కూడా పెయింటింగ్ కనిపించకపోవడంతో సదరు గార్డుకు అనుమానం వచ్చి తోటి సిబ్బందికి విషయం చేరవేశాడు. మోనాలిసా పెయింటింగ్ దొంగతనానికి గురైందన్న వార్తలను అధికారులు, పోలీసులు ధ్రువీకరించారు.
పెద్ద మొత్తంలో డబ్బు ఆశించి ఈ దొంగతనం చేసి ఉంటాడని పోలీసులు అనుమానించారు. కానీ, రెండు రోజులు గడిచినా ఎలాంటి డిమాండ్లు రాకపోవడంతో పోలీసులు వెతుకులాట పనిలో నిమగ్నమయ్యారు. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరక్కుండా దొంగ ఆ పెయింటింగ్ను ఎత్తుకెళ్లడంతో.. పోలీసులు ఆరు వేల పోస్టర్లు ముద్రించి పంచిపెట్టారు. మ్యూజియంలో పనిచేసే అందరినీ విచారించారు. రెండేండ్లపాటు విచారించినా ఫలితం లేకపోయింది. ఇలాఉండగా, ఒక రోజు ఫ్లోరెన్స్లోని ఓ ఆర్ట్ డీలర్కి ఉత్తరం అందింది. ఈ లేఖను విన్సెంజో అనే వ్యక్తి పంపారు. తన వద్ద మోనాలిసా పెయింటింగ్ ఉన్నదని లేఖలో తెలిపాడు. డీలర్ పెయింటింగ్ కొనడానికి ఫ్లోరెన్స్లోని ఒక హోటల్లో విన్సెంజోతో సమావేశమయ్యాడు. ఇదే సమావేశంలో విన్సెంజోను పోలీసులు అరెస్టు చేశారు. మ్యూజియంలో పెయింటింగ్స్ కోసం గాజు ఫ్రేములు తయారు చేసే పనిలో విన్సెంజో కుదిరాడు. ఫ్రేములు చేస్తున్న సమయంలో ఈ ప్రసిద్ధ పెయింటింగ్ను దొంగిలించాడు. దాంతో విన్సెంజోకు ఏడాది 15 రోజుల శిక్ష విధించారు. అయితే, 7 నెలలకే ప్రభుత్వం అతడ్ని విడుదల చేసింది.
ఇవాళ అంతర్జాతీయ పర్వతాల దినోత్సవం
2019 : భారతదేశంలో పౌరసత్వ సవరణ బిల్లు-2016కు పార్లమెంట్ ఆమోదం
2012 : భారతరత్న, ప్రసిద్ధ సితార్ వాద్యకారుడు పండిట్ రవిశంకర్ మరణం
2001 : అంతర్జాతీయ వాణిజ్య సంస్థలో సభ్యదేశంగా చేరిన చైనా
1969 : భారతదేశం చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ జననం
1964 : ఐక్యరాజ్య సమితి విభాగమైన యూనిసెఫ్ స్థాపన
1946 : భారతదేశం రాజ్యాంగపరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
1922 : నటుడు దిలీప్ కుమార్ జననం
1935 : భారతదేశం మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జననం
1687 : మద్రాస్లో మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటుచేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ
చలికాలంలో పెదవులు పగులుతున్నాయా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొవ్వును కరిగించే ఈ పానీయంతో దీర్ఘాయువు సొంతం!
అమ్మో.. నిద్రను ఇన్ని చప్పుళ్లు డిస్టర్బ్ చేస్తున్నాయా?
కరోనా టైంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది వీళ్లే
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..