Telangana Assembly Elections | సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ 26,846 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
మెదక్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి ఆమె 1300కుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Telangana Assembly Elections | కుమ్రంభీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 5వ రౌండ్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మికి 4,747 ఓట్లు వచ్చాయి.
సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు.
Telangana Assembly Elections | సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కారు దూసుకెళ్తోంది. 14వ రౌండ్లో బీఆర్ఎస్ 5253 ఓట్ల లీడింగ్లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి మొత్తం 44218 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
Telangana Assembly Elections | సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత 7,221 ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి సరిత కంటే 1154 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.
Telangana Assembly Elections | సంగారెడ్డి జహీరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ 689 ఓట్లతో లీడింగ్లో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్ రావుకు 4,707 ఓట్లు పోలయ్యాయి.